4, ఏప్రిల్ 2009, శనివారం

జ్ఞానోదయం

ఒక రాజ్యాన్ని విజయకేతుడు అనే రాజు పాలించేవాడు.రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండసాగారు.ఆ రాజ్యం పైకి శత్రు రాజులు దండెత్తి వచ్చారు. హోరా హోరీగా జరిగినయుధ్దంలో విజయకేతుడు ఓడిపోతాడు.రాజ్యం శత్రురాజుల పరమౌతుంది.రాజు ప్రాణాలతో తప్పించుకొంటాడు కానీ శత్రు సైనికులు అతన్ని వెంటాడుతారు. రాజు పరిగెత్తి పరిగెత్తి ఒక కొండమీ దికి చేరుకొంటాడు . ఆపైన ఇక దారి లేదు. వెనుకసైనికులు తరుముకొస్తున్నారు. ముందు దారిలేదు. ఇక కొండపై నుండి క్రిం దికి దూకడం ఒకటే మార్గం.రాజు క్రిందికి దూకబోతూండగా ఒక స న్యాసి వడివడి గా అక్కడికి వస్తాడు.రాజు చేతిలో రెండు చీట్లు పెట్టిఇలా చెబుతాడు
"రా జా! ఈ రెండు చీట్లలో ఒకదానిమీద '1' ఇంకొక దానిమీద '2' అని వేసివున్నాయి. నీకు అత్యంత విషాదము కల్గినప్పుడు 1 నెంబరు చీటి చదువుకో.అత్యంత సంతోషం కలిగినప్పుడు 2 నెంబరు చీటి చదువుకో" అని చెప్పేసి వెళ్ళి పోతాడు. ప్రాణాలు పోతున్న ఈ సమయం కంటే ఇక కష్ట సమయం ఇంకేముంటుంది అనుకొని రాజు మొదటి చీటీ తీసి చదువుతాడు.అందులో ఇలా ఉంటుంది. "ఇది శాశ్వతం కాదు" ఈ అశాశ్వతమైన కష్టం కోసం ఆత్మహత్య చేసి కోవటం అనవసరమని రాజు గ్రహిస్తాడు. ఒక కొండ చెరియ చాటున దాక్కుంటాదు .శత్రు సైనికులు రాజు మరణించాడనిభావించి వెళ్ళిపోతారు.
కొద్దిరోజులు గడుస్తుంది.రాజు సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధం చేసి తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. రాజ్యం లోని ప్రజలందరూ పెద్దపెట్టున సంబరాలు జరుపుకొంటూంటారు.రాజుకూడా సంతోషంగా అందులో పాలు పంచుకొంటాడు.ఆ సంతోష సమయంలో రాజుకు రెండవచీటీ గుర్తుకు వస్తుంది. ఇంతకంటే సంతోష సమయం ఇంకేముం టుంది అనుకొని రాజు రెండవ చీటీ చదువు తాడు .అందులో ఇలాఉంటుంది "ఇదీ శాశ్వతం కాదు" రాజు తల వంచుకొని లోనికి వెళ్ళి పోతాడు.

1 కామెంట్‌:

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!