14, ఏప్రిల్ 2009, మంగళవారం

రాజ నీతి


ఒక రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు.ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు.ఒకసారి రాజసభ జరుగుతున్నాది.సభ మొదలయ్యి అరఘంట అయ్యింది.మహామంత్రి,సైనికాధికారి,ఒకభటుడు,ముగ్గురూ ఆలశ్యంగా సభకు వచ్చారు.రాజుకు కోపం వస్తుంది.భటుడికి నూరు కొరడా దెబ్బలు శిక్ష విధిస్తాడు.సైనికాధికారినిబాగాతిట్టి ఇకపై ఇలాచేస్తే ఉద్యోగంలోంచీ
తీసివేస్తానని బెదిరిస్తాడు. సైనికాధికారి అవమానంతో తలదించుకొంటాడు.ఇక తప్పుచేసిన మహామంత్రి వైపు తిరిగి రాజు ఇలా చెప్తాడు. "మహామంత్రీ! మీరుకూదా ఇలా చేస్తే ఎలా!"
మంత్రి తలదించుకొంటాడు.ఒకే తప్పు చేసినముగ్గురికి రాజు మూడు రకాల శిక్షలు వెయ్యటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఆమాటే తర్వాత రాణీ రాజును అడుగుతుంది. అందుకు రాజు ఇలా సమధానంచెప్తాడు. "రాజు శిక్ష విధించేటప్పుడు ఆశిక్షను అనుభవించేవారిమానసిక స్థితిని,సమాజంలో వారి స్థానాన్ని,దృష్టిలో ఉంచుకోవాలి.నూరుకొరడా దెబ్బలు తిన్న భటుదు త్వరలో ఆశిక్షను మర్చిపోతాడు.మళ్ళీఅదే తప్పు చేస్తాడు.నిండు సభలో జరిగిన అవమానానికి సైనికాధికారి ఇక ఆ తప్పు చేయడు.మహా మంత్రికి నేనన్న ’మీరుకూడాఇలా చేస్తే ఎలా’ అన్న మాటచాలు.ఇక జన్మలో ఆ తప్పు చేయడు.కాబట్టి శిక్షలెప్పుడూ వారి వారి సంస్కారాన్ని బట్టి విధించాలికానీ,అందరికీ ఒకే శిక్షనువిధించకూడదు"
(ఎగ్గిక్యూటివ్ పోస్ట్ లో ఉన్నవారికి ఈ కధ ఒకచక్కని మార్గదర్శి. ఇక్కడ మిత్రులు తప్పుకూ,నేరానికీ ఉన్న తేడాను గమనించాలి)

4 కామెంట్‌లు:

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!