23, ఫిబ్రవరి 2010, మంగళవారం

నేనెందుకిలా..........7

మనిషికి ఆరోగ్యం సరిగాలేనప్పుడు ప్రేమ కురిపించే మనసులు పైన వ్రాల్తాయంటారు.నిజమేనేమో అన్పించింది నాకు  శివాను చూస్తుంటే . వాడు నాకు బాగాలేనప్పటి నుండి నామంచం వదలనే లేదు.అన్నీ మంచం మీదికే సప్లయి చేసేవాడు.ఎప్పుడూ నాతొపోట్లాడే వీడికి నామీద ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్య పోయాను నేను..వాడు నా కాళ్ళవద్ద కూర్చొని కాళ్ళు పిసుకుతూ ఉంటేనా కన్నులు చెమర్చాయి ."చాలు శివా! నీవు వెళ్లి ఆడుకో పో !' అన్నాను.ప్రేమానురాగాలు ఇంత తియ్యగా ఉంటాయని ,వాటిని మనపై కురిపించే అమృత మనస్కులు మన చుట్టూ ఉన్నంత వరకు మనకు ఈ ప్రపంచం ఒక నందనో ధ్యానవనంలా  ,రంగులహరివిల్లులా కన్పిస్తుందని,అప్పుడే నేను తెలుసుకొన్నాను.
క్రమంగా కోలుకొన్న నేను రెండు రోజుల తర్వాతస్కూలుకు వెళ్ళగలిగాను. అక్కడ నిశ్చలను చూసిన నా మనసు ,మళ్లీ భారమయ్యింది .ఆరోజంతా క్లాసులతో బిజిగా ఉండి దాంతో మాట్లాడడమే కుదరలేదు .సాయంత్రం గేమ్సు టిచరు రాకపోవటంతోఅందరు ఎవరి పాటికి వాళ్ళు ఆడుకోసాగారు.నేను నిశ్చల దూరంగా పచ్చికలో కూర్చున్నాము .నేను  మవునంగా ఉన్నాను.
నిశ్చలే మొదలు పెట్టింది.
"ఆమె మా అమ్మ!"  తెలుసన్నట్లు  తల ఆడించాను.
"నీవు పుట్టినప్పటి నుండి మీ అమ్మ ఇలాగె ఉందా?"
"లేదు బృందా! నాకు ఆరేళ్ళు వయసు వచ్చే వరకు బాగానే ఉంది .నేనంటే ఎంత ప్రేమో అమ్మకు!. ప్రతి పండుగకు నాకు బట్టలుకొనేది.రోజు నాకు రకరకాల షోకులు చేసి నన్ను చూసికొని మురిసిపోయ్యేది.నేనేదడిగితే అది క్షణాల్లో అమర్చేది.లోకంలో అమ్మలందరూ ఎలాఉంటారో నాకు తెలీదు కానీ ఒక జీవితకాలానికి సరిపడా అమ్మప్రేమను ఆరేళ్ళకే నేను అమ్మవద్ద పొందగలిగాను.భగవంతుడికే కన్ను  కుట్టిందేమో ,అమ్మను అలాచేసాడు.
"మరి ఎలా?"
దాని ముఖం రక్త వర్ణం లోకి మారింది.  "మా నాన్న వల్లే...?"
నిర్ఘాంత పోవటం నా వంతయ్యింది.
"" అవును బృందా! ఆనందంగా సాగిపోతున్న మా కుటుంబం నాన్న చేసిన పనివల్ల చిన్నా భిన్నమయ్యింది.వాళ్ళ ఆఫీసులో టైపిస్టును పెళ్ళిచేసుకొని ఏకంగా ఇంటికి తీసుకొని వచ్చేశాడు నాన్న.విషయంతెల్సుకొన్న అమ్మ నివ్వెర పోయింది.నాన్ననూ ఆమెనూ అలాగే చూస్తూండి పోయింది చాలాసేపు. స్వతహాగా మా అమ్మ చాలా సాధు స్వభావు రాలు.అటువంటి అమ్మ ఆ రో జు అగ్ని పర్వతమే అయ్యింది.నాన్న నూ ఆమెనీ పట్టుకొని చేతులు నెప్పి పుట్టేవరకూ కొట్టింది.-ఏడ్చి ఏడ్చి, ఆమె శరీరంలోని రక్తమంతా నీరై పోయింది.   నీరసపడిపోయిన అమ్మ స్పృహ కోల్పోయింది.ఆదురదృష్టకరమైనరోజు నాకింకా బాగా గుర్తుంది.మాకుటుంబంలోని సంతోషాన్నీ,ఆనందాన్నీ నిర్ధాక్షిన్యంగా తనతో తీ సుకొని పోయిన రోజది.ఆరోజు తర్వాత మాయింట్లో నవ్వులు మాయమయ్యాయి.నాన్న కూడా సంతోషంగా ఉన్న క్షణాలు నాకు గుర్తులేవు.ఇలా ఎందుకుజరిగింది బృందా? తిరిగిలేచిన అమ్మ మామూలుగా లేదు.పిచ్చిచూపులు చూస్తూంది.ఎవ్వరినీ గుర్తించలేదు.నన్ను కూడా..."
 నిశ్చల మనసు చలించింది.కళ్ళలో నీళ్ళు చిమ్మాయి.కొంచెంసేపు మౌనంగా కూర్చుంది. తర్వాత చెప్పసాగింది...
 "పిన్ని నాన్నతో చెప్పింది.’నేను పెళ్ళి చేసుకొని వచ్చింది,సంతోషంగా ఉండడానికి.అంతేగానీపిచ్చివాళ్ళకు సేవలు చేయటానికి కాదు.ఆమె విషయం మీ రేంచేసుకొంటారో నాకు తెలీదు."అంటూ కుండ బ్రద్దలు కొట్టింది.అమ్మను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని చూశాడు నాన్న.కానీ నేనందుకు ఒప్పుకోలేదు.అమ్మను నేనే చూసుకొంటానని మాట ఇచ్చాను..........

నిశ్చల ఇంటికివెళ్ళి వచ్చిన తర్వాత నా ఆలోచనాపధంలో స్వచ్చమైన మార్పు వచ్చింది.నాకు తెలిసినజీవితం చాలా చిన్నది, సుఖమయమైనది.  కానీ ఇది శాశ్వతం కాదు.
ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విషాదం దాగి ఉంటుందేమో! అలాగేనా జీవితంలో కూడా విషాదం దాగి ఉందా?ఒకప్పుడు సంతోషంగా ఉన్న నిశ్చల ఈరోజు ఇంత విషాద భారాన్ని మోస్తూందంటే,ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ ధుఖాలు కల్సి ఉంటాయా? నా జీవితంలోకూడానా?.....నా చిన్ని బుర్ర ఆలోచనలతో వేడెక్కి పోతూంది. కానీ ఒక్కటి మటుకూ స్పష్టమయ్యింది.--నేననుభవిస్తున్న ఈ సంతోషం,ఆనందం శాశ్వతం గాదు.ఒక పెను విషాదం పొంచిఉంది.
అది ఏ రూపంలో నాపై దాడి చేస్తుందో తెలీదు.  మరికొద్ది రోజుల తర్వాతగానీ నా ఆలోచనలకుఒక రూపం రాలేదు.జీవితంలోని మరోకోణాన్ని నేను సింధుజా వాళ్ళింట్లో చూడగలిగాను....కొద్ది రోజుల తర్వాత .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!