16, మార్చి 2009, సోమవారం

రామవంశం


శ్రీ రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు .రావణుడిని సంహరించి సీతను తీసుకు వచ్చాడు.ఇప్పుడు అతనికి ఒక కోరిక పుడుతుంది.వసిష్టుడితో ఆ కోరిక చెబుతాడు.'నేను ఇంత కష్టపడి రావణుడిని సంహరించాను కదా !సీతను అగ్ని ప్రవేశం
చేయించి మరీ తెచ్చుకొన్నాను కదా ,మా వంశానికి ఇంకా రఘు వంశమనే పేరు
ఎందుకు? రామ వంశము అని వచ్చుగదా "
వశిష్టుడు చిరునవ్వు నవ్వి "అలాగే చెయ్యవచ్చు .కాని దానికి ముందు రఘు మహారాజు జీవితం లో జరిగిన ఒక సంఘటన చెపుతాను విను అని ఇలా చెప్పసాగాడు .
రఘుమహారాజు ఒకసారి భార్యతో కలిసి వేటకు పోతాడు.చాలాసేపు వేటాడిన తర్వాత ఇద్దరూ బాగా అలిసి పోతారు.మిట్టమధ్యాన్నం సమయం. సైనికులు యెవ్వరూ లేరు.తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి.రాణికి దాహం వేస్తూంది. యెక్కడైనా నీళ్ళు కనిపిస్తాయేమోనని వెదుకుతూ బయలుదేరారు.కొంచెం దూరంలో ఒక పర్ణశాల క్యనిపినిచింది. అది ఒక గురుకులం. గురువు శిష్యులకు భోదిస్తున్నాడు.ఇద్దరూ వెళ్ళి తమను పరిచయం చేసుకొని దాహంగాఉందని చెబుతారు.గురువు వారికి మర్యాదలు చేసి ఆహారానికూడా ఇచ్చి సగౌరవం గా పంపుతాడు.
కొద్దిరోజులు గడుస్తుంది.తనసిష్యుల్లో ఒకడు తేడాగా ఉండడం గమనిస్తాడు గురువు.అతడు బాగా చిక్కి పోతాడు. చదువు మీద ఏకాగ్రత పోతుంది. అన్య మనస్కంగా కనిపిస్తాడు. గురువు అతడిని కారణం అడుగుతాడు. శిష్యుడు చెప్పడానికి సందేహిస్తాడు. అడగ్గా అడగ్గా శీష్యుడు చెప్పిన విషయం విని నివ్వెర పోతాడు గురువు.
గురుకులంలో రాణిని చూసిన శిష్యుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు .ఎలాగైనా కనీసం ఒక రోజైనా ఆమెతో గడపాలని
లేకుంటే తాను ప్రాణాలతో ఉండనని చెప్తాడు .నయాన భయానా గురువెంతచెప్పినా శిష్యుడు వినడు.
వేరు దారి లేక గురువు బయలుదేరి రాజు వద్దకు వెళ్తాడు.విషయం తెల్సుకున్న రాజు చిన్నగానవ్వి "స్వామీ!ఇది పూర్తిగా
రాణి గారి సమస్య! నాకెందుకు చేఫున్నారో అర్ధం కావటం లేదు.మీరు ఈ విషయం ఆమెకే సెలవివ్వండి"అని చెప్తాడు.
గురువు రాణి గారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పి క్షమించమని అడుగుతాడు. రాణి మ్లానత వదనయై కొంత సేపు కూర్చుం టుంది.చివరకు తలెత్తి "స్వామీ!మీ శిష్యుని ఈరోజు రాత్రికే రాణివాసానికి పంపండి.నేను సిద్ధంగా ఉంటాను"అంటుంది.
నిర్ఘాంతపోయిన గురువు శిష్యుడికి విషయం చెప్తాడు.
సంతోషంతో వచ్చిన శిష్యుడు రాణిని చూసి తెల్లమొగమేస్తాడు.
రాణినిండుగా చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని చిరు నవ్వుతో అమ్మవారిలా కనిపిస్తుంది .శిష్యుడు ఆమె కాళ్ళపై
పడిసాష్టాంగ ప్రమాణం చేస్తాడు. తన తప్పును క్షమిం చమని వేడుకొంటాడు.అతన్ని లేవదీసి జుట్టు నిమిరి రాణి ఇలా
చెప్తుంది."కుమారా! ఇందులో నీతప్పేమి లేదు.బహుశా గురుకులానికి నేను వచ్చినప్పుడు నా వస్త్ర ధారణా
హావ భావాల్లో ఏదైనా పొరబాటు దొర్లి నీకలాంటి వికారం కల్గి ఉండొచ్చు.అందుకు నేనే క్షంతవ్యురాలిని."అని చెప్పి
పంపి వేస్తుంది.
వసిష్టుడు ఈ సంఘటన చెప్పి " ఇప్పుడు చెప్పు రామా! సీతను రక్షిం చుకోవటానికి నీవు ఎంతమంది సహాయం
తీసుకొన్నావు? ఎన్నిరోజులు గడిపావు? రఘుమహా రాజెక్కడ ? నీవెక్కడ ? మీది రఘు వంశమా ,రామవంశామా?
నీవే తేల్చుకో!" రాముడు అతనికి నమస్కరించి తలవం చుకుంటాడు.

2 కామెంట్‌లు:

  1. జయ చంద్ర గారు , రామాయణం లోని పిట్ట కధలు చాలా విన్నాను కానీ ....ఈ కధ విభిన్నంగా ఉంది .ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  2. idi "raghu vaMSa charitra"(kaaLidaasu kaavyamu) nijaMgaanE unnadaa?nijaM kaaka pOyinaa,siitaa maata nu agni pravESaM chEyiMchina Ganata,=veliti SrI rama chaMdrunu charitralO,nilichi pOyina machcha.
    daaniki javaabugaa,aa vaMSIyula charitralOnuMDE Erparachina chamatkaaraM idi.

    రిప్లయితొలగించండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!